ఈషా డియోల్ తిరిగి వచ్చేస్తోంది. అయితే, హేమా మాలిని వారసురాలు పెద్ద తెర మీదకి రావటం లేదు. డిజిటల్ డెబ్యూతో స్మార్ట్ స్క్రీన్స్ పై సందడి చేయనుంది. ఈషా డియోల్ తక్తానీ పెళ్లి తరువాత పూర్తిగా కెమెరాకు దూరమైంది. అయితే, ఇప్పుడు తనని మిస్ అవుతోన్న ఫ్యాన్స్ కి మిసెస్ ఈషా డియోల్ ‘రుద్రా : ద ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో ఎంటర్టైన్మెంట్ పంచనుంది. బ్రిటన్ లో సూపర్ సక్సెస్ అయిన బీబీసీ వారి వెబ్…
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు కె. మురళీమోహన్, సునీల్ నారంగ్ ఇతర సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వారం చెప్పినట్టుగానే నిర్మాతలు ఓటీటీ బాట పట్టకుండా అక్టోబర్ 30 వరకూ వేచి ఉండాలని, ఆ తర్వాత కూడా పరిస్థితులు ఇలానే ఉంటే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవాలని తీర్మానించినట్టు సునీల్ నారంగ్ తెలిపారు. అగ్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సైతం…
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ…
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని…
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నెట్ ఫ్లిక్స్ బాట పట్టబోతున్నాడు. స్ట్రీమింగ్ జెయింట్ తలపెట్టిన ఓ నాన్ ఫిక్షన్ షోలో బ్రిటీష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ తో కలసి సాహసాలు చేయనున్నాడు. జూలై, ఆగస్ట్ నెలల్లో రణవీర్ సైబీరియాలో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ తో కూడిన షూట్ కి సిద్ధం అవుతున్నాడు! Read Also: అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా! సూపర్ ఫిట్ నెస్ ఉంటేనే ఎవరైనా గ్రిల్స్ అడ్వెంచర్…
బాలీవుడ్ లో చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఓటీటీ బాట పడుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న యాక్టర్స్ మాత్రమే కాదు కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయిన వారు కూడా డిజిటల్ జోష్ ప్రదర్శిస్తున్నారు! తమ ఫ్యామిలీలో ఇప్పటికే సీనియర్ బచ్చన్, జూనియర్ బచ్చన్ ఓటీటీ బాట పట్టగా జయా బచ్చన్ కూడా వెబ్ సిరీస్ కి సై అంటోంది! 5 ఏళ్ల తరువాత మళ్లీ తెర మీదకు రాబోతోంది… జయా బచ్చన్ ‘సదా బహార్’…
నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ ముగించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.…
గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది…
మొత్తం దేశంలోనే కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు కూడా కొనసాగుతోంది. చెన్నై సహా రాష్ట్రమంతటా స్ట్రిక్ట్ లాక్ డౌన్ విధించారు. మరి ఇటువంటి సమయంలో సినిమా కష్టాలకు కొదవుంటుందా? కోలీవుడ్ లో చాలా సినిమా థియేటర్లు లేక రిలీజ్ అవ్వటం లేదు. అంతకంటే ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ దశలో, పోస్ట్ ప్రొడక్షన్ దశలో నిలిచిపోయాయి. అందుకే, అన్ని విధాల తమ సినిమాలు పూర్తైన దర్శకనిర్మాతలు ఓటీటీ వేదికలకు జై కొడుతున్నారు. ఈ లిస్ట్…