థియేటర్లు తెరిస్తే సమస్య పరిష్కారం అవుతుందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ బాట పడుతున్నారు.
Read Also: హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్! భారీగా రెమ్యూనరేషన్!!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ఇదే సమయంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్… అక్టోబర్ మాసం వరకూ వేచి ఉండమని, తొందరపడి ఓటీటీలో సినిమాలను విడుదల చేయవద్దని నిర్మాతలను కోరింది. అప్పటికీ థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోతే… ఓటీటీలో విడుదల చేసుకోమని సలహా ఇచ్చింది. అదే సమయంలో సినిమా టిక్కెట్ రేట్లను పెంచకపోతే… థియేటర్ల మనుగడ కష్టమని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసింది.
చిత్రంగా ఇది జరిగిన రెండు రోజులకే ఆంధ్రప్రదేశ్ సర్కార్ యాభై శాతం ఆక్యుపెన్సీతో ఈ నెల 8 నుండి థియేటర్లు తెరుచుకోవచ్చని తెలిపింది. అయితే అక్కడ రాత్రి కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. సో… సెకండ్ షోస్ ను ప్రదర్శించే ఆస్కారం లేదు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుండి రాత్రి 7 గంటల వరకే కర్ఫ్యూను సడలించారు. అక్కడ ఫస్ట్ షోస్ వేయడానికీ అవకాశం ఉండదు. ఇక తెలంగాణ ప్రభుత్వం నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను గత నెల 20 నుండే తెరుచుకోవచ్చునని ఆదేశాలు జారీ చేసింది. కానీ థియేటర్లు తెరుచుకున్నంత మాత్రాన తమ సమస్యలకు పరిష్కరం దొరకదని ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ భావిస్తున్నారు.
Read Also: విడాకుల విచారంలో ఆమీర్! ‘దంగల్’ ఖాన్ కి ‘దబంగ్’ ఖాన్ ఓదార్పు!
ఇదే విషయమై తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో సురేశ్ బాబు, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ తదితరులు సమావేశమయ్యారు. సినిమా థియేటర్ల రీ-ఓపెనింగ్ లోని ఇబ్బందులను వివరించారు. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచినప్పుడు, అలానే నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ కోరిక మేరకు టిక్కెట్ రేట్లను పెంచినప్పుడు మాత్రమే పెద్ద సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సో… ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా పాత సినిమాలు, చిన్న సినిమాలతో కాలక్షేపం చేయాల్సిందే!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..