జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ నేతలకు వివరించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఈ నెల 18వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇక, ఆదే రోజు రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగోబుతున్నాయి.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్న నేపథ్యంలో.. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.. ఇదే, సమయంలో.. వారిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రెడీ అవుతోంది అధికార పక్షం.. ఇక, ఈ సారి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు……
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరోసారి ఫిర్యాదు చేసింది వైసీపీ… ఇవాళ ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు.. ఈ సందర్భంగా రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీలు.. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు…