All Party Meeting: లోక్సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ.. ఆ అంశాలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Party Meeting: జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ నేతలకు వివరించారు. స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్, వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్రెడ్డి, ఆర్ఎల్జేపీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్, ఇతర పార్టీ ఎంపీలు హాజరయ్యారు. అయితే తెరాస మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని.. ఆమోదం కోసం 24 బిల్లులు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరగనుంది.పెండింగ్లో ఉన్న కొన్ని బిల్లుల్లో ఇండియన్ అంటార్కిటికా బిల్లు-2022 కూడా ఉంది. బిల్లు లోక్సభలో పెండింగ్లో ఉంది.
అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల (సవరణ) బిల్లు-2019 లోక్సభలో ఆమోదించబడింది. రాబోయే సెషన్లో రాజ్యసభలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.సామూహిక విధ్వంసం యొక్క ఆయుధాలు, వాటి పంపిణీ వ్యవస్థల (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు-2022 లోక్సభలో ఆమోదించబడింది. ఇంకా రాజ్యసభ ఆమోదించలేదు. వన్యప్రాణుల (రక్షణ) సవరణ బిల్లు-2021 లోక్సభలో పెండింగ్లో ఉంది. సముద్రపు పైరసీ నిరోధక బిల్లు-2019, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు-2021 కూడా లోక్సభలో పెండింగ్లో ఉన్నాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
TRS Parliamentary Party : ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో కొత్తగా ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లుల్లో సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు-2022 కూడా ఉన్నాయి.కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు-2022ను కూడా ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు మరికొన్ని బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయని ఓం బిర్లా తెలిపారు.త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాలని డిమాండ్ చేశామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై కూడా చర్చించాలని డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. సభలో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షానికి తగినంత సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..