సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్.. నిన్నటివరకు వంట నూనెల ధరలు కాస్త తగ్గిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి భారీగా పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వంటనూనె, గోధుమల ధరలు పెంచేందుకు మార్కెట్ సిద్ధం అవుతోంది. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రతికూల వాతావరణం కారణంగా భారతదేశం సన్ఫ్లవర్ ఆయిల్, గోధుమల ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది.. ఈ వార్త సామాన్య ప్రజలకు చేదు వార్త అనే చెప్పాలి.. ఇక పప్పులు, కూరలు, టమోటాలు, పాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే…
అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతుంది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటింది. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది.…