గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడులో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ సీట్ ఆఫర్ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత…
కొంతకాలంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి లోకల్ టీఆర్ఎస్ కీలక నేతలకు, ఉద్యమకారులకు మధ్య గ్యాప్ వచ్చింది. టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి వచ్చిన వారితోనూ దూరమే. చివరకు తెలంగాణ ఉద్యమకారులు టచ్ మీ నాట్గా ఉండటంతో.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒంటరైన పరిస్థితి. ఆలస్యంగా సమస్యను గుర్తించినా.. ఆ తీవ్రత వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందని MLA గ్రహించారట. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు భూపాల్రెడ్డి. అయితే, కొద్దిరోజులుగా ఎమ్మెల్యే డైలీ ప్రోగ్రామ్స్ మారిపోయాయి. ఉద్యమ…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో కొట్లాటలు.. గ్రూప్ రగడ కొత్తమీ కాదు. ఢిల్లీ స్థాయి నేతల మధ్య కూడా గల్లీ లెవల్లో విభేదాలు బయట పడుతుంటాయి. ఒక్కో సెగ్మెంట్లో మూడు ముక్కలాటలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఆయనదో వర్గం ముందుకొచ్చింది. ఈ విధంగా ముగ్గురు కీలక నాయకుల పేర్లు చెప్పి పార్టీ కేడర్ మూడుగా విడిపోయిన పరిస్థితి. ఎవరిని…
అనంతపురం జిల్లా రాప్తాడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి రాజకీయ వివాదాలే. మాజీ మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మధ్యలో రెండు వర్గాలు శాంతించినా.. పరిటాల సునీత పాదయాత్ర చేస్తాననడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డిని జాకీ పరిశ్రమ వివాదం కొత్తగా చుట్టుముట్టడంతో రాప్తాడులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జిల్లాలో లేని పరిశ్రమ చుట్టూ సాగుతున్న పాలిటిక్స్ ఏకంగా తాడేపల్లిని తాకడంతో హాట్ టాపిక్గా మారిపోయింది.…
తనదాకా వస్తే తెలియదన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఎఐసీసీ నాయకత్వాన్ని తిట్టినా పట్టించుకునే తీరిక.. ఆలోచన లేదు. ఎవరికి వారు నాకెందుకులే అని వదిలేస్తున్నారట. తిట్టింది నన్ను కాదు కదా అనే భావన మరికొందరిది. తిట్టేవాళ్లు తిట్టని.. పడేవాళ్లు పడని అనుకుంటున్నారో ఏమో.. చివరకు రాహుల్గాంధీ మొదలుకొని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వరకు అందరినీ దూషించినా ఒక్కరిలోనూ చలనం లేదు. కాంగ్రెస్కు లాయలిస్ట్గా కొనసాగిన మర్రి శశిధర్రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రాహుల్గాంధీని, కెసి వేణుగోపాల్ను..…
గద్వాల.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలిచే ప్రాంతం. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల రాజకీయం మరోలా ఉంటుంది. గతంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. తాజాగా స్వపక్షంలోనే విపక్షం పుట్టుకొచ్చింది. అదను చూసి అప్పర్ హ్యండ్ కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికారపార్టీలో కనిపిస్తోంది. అయితే నేతల మధ్య ఆధిపత్యపోరులో నియోజకవర్గంలోని అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ సరితా…
రాజకీయాల్లో ఒక స్టేజ్కు వచ్చాక.. వారసులను బరిలో దించాలని చూస్తారు నాయకులు. ఒక్కరే కొడుకో.. కూతురో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కరే పోటీ చేస్తారు. అలాంటి సమయంలోనూ పెద్దగా ఇక్కట్లు ఎదురు కాబోవు. కానీ.. ఇంట్లో ఉన్న వారసులంతా పోటీ చేస్తామని భీష్మిస్తే..! వారసులతోపాటు తండ్రి కూడా పోటీ చేస్తానని మొండి కేస్తే..! ఇంటిలోనే రాజకీయ రసకందాయంలో పడటం ఖాయం. మంత్రి విశ్వరూప్ సైతం ఇదే ఇరకాటంలోనే పడ్డారట.…
టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ వైరం.. తెలంగాణలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దృష్టి పెట్టగా.. తాజాగా గ్రానైట్ వ్యాపారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED విచారణ మొదలుపెట్టింది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ దాడులు సరేసరి. మునుగోడు ఉపఎన్నిక ముగియగానే ఈడీ విసిరిన పంజా రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది. అది పొలిటికల్గానూ అలజడికి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఈడీ రైడ్స్ రాడార్ పరిధిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు..…
పార్టీలు మారుతున్నా ఫలితం లేదు. ఎన్ని కండువాలు మార్చినా పదవి దక్కటం లేదు. అన్ని పార్టీలను ఓ రౌండ్ వేసిన ఆయన, చివరికి హస్తం గూటికి చేరారు. ఇక్కడైనా ఉంటారా? లేక మరో గూటికి చేరతారా? పూటకో పార్టీలో చేరితే, కేడర్ పరిస్థితేమిటనే చర్చ నడుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా పనిచేసిన బోడ జనార్థన్ మరోసారి పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీలు మార్చడంలో ఆయన రికార్డు చెరిగిపోనిదనే టాక్…
కేశినేని నాని కేంద్రంగా బెజవాడ టీడీపీ రాజకీయం మరోసారి వేడెక్కుతోందా? కొత్తగా కేశినేని వర్సెస్ కేశినేని అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఎందుకలా? విజయవాడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ ఎపిసోడ్లో మరోవర్గం ఎలాంటి పాత్ర పోషిస్తోంది? కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని బెజవాడ టీడీపీలో అగ్గి రాజుకున్నట్టే కన్పిస్తోంది. నిన్నటి వరకు ఎంపీ కేశినేని నాని వర్సెస్ మిగిలిన లీడర్లు అన్నట్టుగా ఉండేది. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, నాగుల్ మీరా,…