పూరి జగన్నాథుడి రథయాత్రం నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా జగన్నాథుడి రథయాత్రకు భక్తులు హాజరు కాలేకపోయారు. ఈ సారి మాత్రం జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పూరికి చేరుకుంటున్నారు. దాదాపుగా 10 లక్షల మంది భక్తలు వస్తారని ఒడిశా అధికారులు అంచనా వేస్తున్నారు. https://youtu.be/9Bpv0H56giY జగన్నాథుడి రథయాత్రలో జగన్నాథుడు, దేవీ సుభద్ర, బలభద్ర భగవానుడిని మూడు రథాల ద్వారా లాగుతారు. భక్తులు పెద్ద సంఖ్యలో…
తమ రాష్ట్రానికి చెందిన శ్రీమతి ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు.. ఒడిశా శాసనసభ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు సీఎం నవీన్ పట్నాయక్
గజరాజుకు కోపం వస్తే ఏం జరుగుతోందో.. ఎలా ప్రవర్తిస్తోందో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ప్రశాంతంగా ఉండే గజరాజుకు కోపం వచ్చిందంటే.. ఆపడం ఎవరితరం కాదు.. విధ్వంసం సృష్టిస్తోంది.. పంట పొలాలు, వాహనాలు, ప్రజలు, జంతువులు.. ఇలా ఏది అడ్డువచ్చినా.. అడ్డుకోవడం కష్టమే.. అయితే, తాజాగా ఓ ఏనుగు ప్రవర్తించిన తీరు మాత్రం సోషల్ మీడియాకు ఎక్కింది.. ఔరా..! ఆ గజరాజు ఎందుకు ఇలా చేశాడు..? మహిళలను తొక్కి చంపడం ఏంటి..? ఆ తర్వాత అంత్యక్రియలను కూడా…
ఎట్టకేలకు బావిలో పడిన చిరుతపులిని అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం సంబల్పూర్ జిల్లా హిందోల్ ఘాట్ లో చోటు చేసుకుంది. హిందోల్ ఘాట్ సమీపంలోకి మంగళవారం ఈనెల 7న సాయంత్రం వచ్చిన చిరుత ఉన్నట్లుండి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. బావి నుంచి బయటకు వచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించింది. అయితే.. బావి లోతుగా ఉండటంతో పాటు నీళ్లు కూడా ఉండటంతో పైకి ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. అటువైపుగా…
ఒక్కొక్కరికి ఒక్కో వింత అలవాటు ఉంటుంది. కొందరు కొన్ని పదార్ధాలను ఇష్టంగా తింటుంటారు. చిన్నపిల్లలు బలపాలు తింటారు. పెద్దవాళ్లు జంక్ ఫుడ్ తింటారు. అయితే ఒడిశాలోని ఓ వ్యక్తి మాత్రం ఇసుక తింటున్నాడు. అతడి పేరు హరిలాల్ సక్సేనా. వయసు 68 ఏళ్లు ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అతడు వలసకూలీగా పనిచేస్తుంటాడు. ఉపాధి కోసం పదేళ్ల కిందట ఒడిశాకు వలస వెళ్లిపోయాడు. గంజాం జిల్లాలోని కిర్తిపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు.…
ఆ జంటకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.. అనతికాలంలోనే వ్యక్తిగతంగా కలుసుకున్నారు.. చూస్తుండగానే ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. అయితే, పెళ్ళయ్యాక అసలు విషయం తెలిసి వరుడు సహా అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.. ఇంత దారుణమైన మోసం చేస్తావా అంటూ ఆ వధువుని చితకబాదారు. అసలేం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాకు అలోక్ కుమార్ మిస్త్రీకి కొన్ని రోజుల క్రితం ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్బుక్లో…
అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తోంది.. ఆ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, అసని తుఫాన్పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశాపై ‘అసని’ తుఫాన్ ప్రభావం, దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధతపై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిగింది.. తుఫాన్ రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాకినాడ-విశాఖపట్నం తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని.. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై…
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. దోమలగూడ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ పేరుతో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారు. హైదరాబాద్ నుండి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఫార్మా మందులతోపాటు సప్లై చేస్తున్న కంపెనీ గుట్టుని పట్టేశారు పోలీసులు. జే ఆ ర్ ఇన్ఫినిటీ పేరుతో కంపెనీ నడిపిస్తున్న వైనం బయటపడింది. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎన్ సి బి అధికారులు షాకయ్యారు. 3.71 కోట్ల రూపాయల…
ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య కోడి గుడ్ల వివాదం ఇంకా చల్లారలేదు. ఒడిశాలోని కుర్ధా రోడ్ వద్ద ఏపీకి చెందిన కోడిగుడ్ల లారీలను ఒడిశా పౌల్ర్టీ రైతులు, ట్రేడర్స్ అడ్డుకున్నారు. సుమారు రెండు వందల కోడిగుడ్ల లారీలు జాతీయరహాదారిపై నిలచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ తో చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఎండ వేడికి గుడ్లు పాడవుతాయని ఆంధ్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేతల ధరలు పెరుగుతుండటం, గుడ్డు ధర పెరగకపోవడంతో ఒడిశా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రల…