PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం అస్సాంలోని మోరాన్లోని హైవేపై ల్యాండ్ అయింది. ఇది చారిత్రాత్మక ల్యాండింగ్గా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ELF) వద్ద విమానం ల్యాండ్ అయింది. ఇది దేశ వ్యూహాత్మక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యవసర సమయాల్లో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యేల ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేశారు. శనివారం ఈ రన్వేను ప్రధాని మోడీ ప్రారంభించారు.…
PM Modi: గౌహతి విమానాశ్రయం కొత్త టెర్మినల్ను శనివారం ప్రధాని నరంద్రమోడీ ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంత భద్రత, గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారుల్ని రక్షించిందని ఆరోపించారు.
Southwest Monsoon: దేశంలోకి అనుకున్న విధంగానే నైరతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని అనుకున్నప్పటికీ రెండు రోజుల ముందుగానే మే 30న కేరళ తీరానికి రుతుపవనాలు చేరాయి.
గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు.