Home
Nitish Kumar Reddy
Nitish Kumar Reddy News
-
IND vs AUS Day 1: ముగిసిన మొదటి రోజు ఆట.. ఫలించని టీమిండియా బౌలర్ల కష్టం
IND vs AUS Day 1: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు ఆగస్టు 6 అడిలైట్ వేదికగా రెండో టెస్ట్ మొదలైంది. ఈ టెస్టు డే అండ్ నైట్ కావడంతో పింక్ బాల్ తో మ్యాచ్ ఆడారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఆర్ వికెట్లు తీయగా టీమిండియా తక్కువ పరుగులకే కుప్పకూలింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 180… -
Nitish Kumar Reddy: నాకోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం: నితీశ్ రెడ్డి
తన కోసం నాన్న ఉద్యోగాన్ని వదిలేశారని, తాను ఇప్పుడు క్రికెటర్గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం అని తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ఆర్థిక సమస్యల కారణంగా తాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం అని, ఒక రోజు నాన్న ఏడవడం కూడా చూశానని చెప్పాడు. ఇప్పుడు ఓ కుమారుడిగా నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నా అని, తన తొలి జెర్సీని ఆయనకే ఇచ్చానని నితీశ్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన… -
IND vs AUS: తీరుమారని టీమిండియా.. 150కే ఆలౌట్
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో నేడు మొదటి మ్యాచ్ పెర్త్లో మొదలయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్గా నిలవగా.. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ఆస్ట్రేలియా జట్టు డామినేషన్ క్లియర్ గా కనపడింది. భారత ఇన్నింగ్స్… -
Nitish Reddy Debut: పెర్త్ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుని.. ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తాడు. భారత్ యువ ఆల్రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్… -
Nithish Kumar Reddy: అదే నా చిన్నప్పటి కల: నితీశ్ రెడ్డి
ఆస్ట్రేలియాపై ఆడాలనేది తన చిన్నప్పటి కల అని తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ప్రతి క్రికెటర్కు దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తాడని, తనకు ఇప్పుడు అలాంటి అవకాశం రానుండటం ఆనందంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్లో ఆడానని, ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా బరిలోకి దిగాల్సి ఉంటుందని నితీశ్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్కు నితీశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పేస్ ఆల్రౌండర్ లోటును నితీశ్తో… -
Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి ఒక్కడే.. ఇదే సూపర్ ఛాన్స్!
ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాచాటిన విషయం తెలిసిందే. 303 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇటీవల భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్.. ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్టు జట్టులో నితీశ్కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్పై తన అరంగేట్ర సిరీస్లో నితీశ్ రెడ్డి… -
IND vs AUS Test Series: నితీశ్ రెడ్డికి జాక్పాట్.. ఏకంగా టెస్టుల్లోకి ఎంట్రీ!
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే భారత జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత్-ఏ జట్టులో కూడా మనోడికి చోటు దక్కింది. ఇక అతి త్వరలోనే టెస్టుల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి నితీశ్ను బీసీసీఐ ఎంపిక చేయనుందని… -
IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్! నితీశ్ రెడ్డికి చోటు
అక్టోబరు 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ను ఇండియా ఎ జట్టుకు కెప్టెన్గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. గత కొన్ని నెలలుగా భారత జట్టుకు ఎంపిక కాని యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్కు భారత్-ఎ జట్టులో చోటు దక్కింది. ఆంధ్ర యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి,… -
Pat Cummins: ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సక్సెస్కు కారణం పాట్ కమిన్స్!
Basit Ali Huge Praises on Pat Cummins: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తెలుగు ఆటగాడు నితీశ్కుమార్ రెడ్డి సత్తాచాటాడు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ (74; 34 బంతుల్లో 4×4, 7×6) చేసిన నితీశ్.. బౌలింగ్లో రెండు వికెట్లు (2/23) పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ (15; 11 బంతుల్లో 3×4,) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. గత సిరీస్లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ ఇద్దరు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్… -
Nitish Kumar Reddy: రెండో మ్యాచ్లోనే రెండు రికార్డులు సృష్టించిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండు భారీ రికార్డులను సాధించాడు. ఒకే మ్యాచ్లో 70కి పైగా పరుగులు చేయడంతోపాటు బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు టీ20ల్లో ఏ భారతీయుడు కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ గెలుచుకున్న రెండో యువ భారత ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్…
తాజావార్తలు
-
Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
-
Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
-
Astrology: జూలై 4 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!