సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. “సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ,…
పార్టీ ఒకటే కానీ నేతలు వేరయ్యారు. విడిపోయారు. అసలే ప్రజాస్వామ్యం ఎక్కువైన కాంగ్రెస్ పార్టీలు ఆందోళనల్లోనూ ఎవరి ధోరణిలో వారు ముందుకెళుతున్నారు. సంగారెడ్డీ జిల్లా కేంద్రంలో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్ ధరలు తగ్గించాలని పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ ధర్నాతో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం చర్చకు దారితీస్తోంది. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ వర్గం, జగ్గారెడ్డి వర్గం వేర్వేరు చోట్ల ధర్నాలు నిర్వహించారు. సంగారెడ్డి…