నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు’ కేసు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ నుంచి…
ల్యాండ్ అయిన జగన్.. వైసీపీ నేతలు ఘన స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. జగన్ దంపతులు నేడు ( మంగళవారం ) గన్నవరం చేరుకున్నారు. పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి…
గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సనా ఖాన్.. సినిమా ప్రపంచానికి వీడ్కోలు పలికింది. గతంలో బిగ్ బాస్ స్టార్ గా ఎదిగిన సనాకు.. చాలా మంది అభిమానులు ఉన్నారు. మరోవైపు గత జూలైలో తనకు పాప పుట్టిందన్న వార్తను సనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్, సనాలను అభినందించేందుకు పలువురు వేదికపైకి వచ్చారు. ప్రస్తుతం సనా పాపకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రపంచ…
ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో ఉదయం రోడ్డు కుంగింది. బుధవారం ఉదయం ప్రధాన రహదారి మధ్యలో ఉన్నట్టుండి కుంగిపోయింది. 4 గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై అదృష్టవశాత్తూ ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు.
గత 24 గంటల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టారు. సోమవారం సతారాలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే సమయం వచ్చినప్పుడు అందరూ నా వెంటే ఉంటారని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు నేటి నుంచి మార్పు మొదలవుతుందని, ఎన్సీపీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, ప్రజల మద్దతు తమకు ఉంటుందని శరద్…