ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా తొమ్మిదవ మ్యాచ్ శనివారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో గుజరాత్ తన తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్…
Narendra Modi Stadium is Luky to Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్కు చేరింది. రెండు నెలలుగా 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్లు నాకౌట్ దశకు చేరాయి. నేడు క్వాలిఫయర్-1 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమేనటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయిర్-2లో తలపడుతుంది. రిస్క్ తీసుకోకుండా క్వాలిఫయర్-1లోనే గెలిచి…
నేడు ఐపీఎల్ 2024 17వ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 ప్రస్తుత సెషన్లో ఇరు జట్లకు ఇది నాల్గవ మ్యాచ్. మ్యాచ్ నేడు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్ లలో 4 పాయింట్లతో -0.738 రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్…
చివరి మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిపోయింది. రెండు జట్లూ ఒక విజయం, ఒక ఓటమిని కలిగి ఉన్నాయి. రెండు జట్లూ ఒకే ప్రత్యర్థి ముంబై…
రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నంత సేపు స్టేడియంలో రోహిత్ రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. హార్దిక్ పాండ్యా టాస్ కోసం వచ్చినప్పుడు కూడా స్టేడియంలో అభిమానులు అతన్ని హేళన చేస్తూ అరుపులు చేశారు. రోహిత్ శర్మ గ్రౌండ్ లో క్యాచ్ పట్టిన టైంలో నరేంద్ర మోడీ స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది.
World Cup 2023: క్రికెట్ ఫ్యాన్ రేపు జరగబోతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది.
రేపు (ఆదివారం) ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మహా సంగ్రామం జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ పరిస్థితులను ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ పరిశీలించారు.