సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ ఇచ్చింది నరసరావుపేట కోర్టు.. పోసానిని ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి.. పోసానిని రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నరసరావుపేట కోర్టు ఆదేశాలు జారీ చేసింది..
నరసరావుపేట జిల్లా కోర్టులో పోసాని కృష్ణ మురళిని ప్రవేశ పెట్టారు పోలీసులు. టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదుతో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదు అయింది. నరసరావుపేట టూ టౌన్ పీఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు. దీంతో పీటీ వారెంట్పై రాజంపేట సబ్జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్న సరసరావుపేట పోలీసులు నరసరావుపేట జిల్లా కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో నరసరావుపేట జిల్లా కోర్టు పోసాని కృష్ణ మురళికి…