దోపిడీ దొంగను పట్టుకోవడానికి పోలీసులు కోవర్టు అపరేషన్ చేపట్టారు. చెంచు యువకులను ఇన్ఫార్మర్లుగా మార్చి దొంగను పట్టుకునే యత్నం చేశారు. చెంచు యువకుల బాణాలకు దొంగ గాయపడి అడవిలోకి పరారయ్యాడు. చికిత్స కోసం అడవి నుంచి బయటికి వస్తే అరెస్టు చేయాలని పోలీసుల ప్రయత్నిస్తున్నారు. బండి ఆత్మకూరు మండలంలోని నారపరెడ్డికుంటలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగ హనుమంతు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడిపై 12కు పైగా దొంగతనం,…
నంద్యాల విజయ డైరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికలను తాత్కాలికంగా రద్దు చేశారు.. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఆళ్గడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరులు భారీ సంఖ్యలో వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో, పోలీసుల సలహా మేరకు నామినేషన్ ప్రక్రియ వాయిదా వేసినట్లు ప్రకటించారు నంద్యాల విజయ డైరీ ఎండీ ప్రదీప్..
గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీ తప్ప.. వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ డ్రైనేజీ పనులు కూడా చేయ లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. జుర్రెరు వాగు నీరు కలుషితం కాకుండా 30 నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనులు పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నాం అని మంత్రి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో రూ.30.66…
రన్నింగ్ బస్సు టైర్ పేలి.. ఆ వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నరాయి.. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.. బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్ పేలడం కాకుండా.. ఆ సమయంలో రాపిడికి మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో పాక్షికంగా ట్రావెల్స్ బస్సు కాలిపోగా.. అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి బయటపడిన ప్రయాణికులు వారి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఈరోజు (శుక్రవారం) నంద్యాలలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:25కు పట్టణంలోని శ్రీనివాసనగర్లో మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూఖ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.
కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..
అవుకు మండలం సింగనపల్లెలో మద్యం మత్తులో ఓ వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు.. అది ఎంతలా అంటే.. కిక్కులో నిద్రపోతున్న అతడిపైకి కొండ చిలువ వచ్చి చేరినా సడిసప్పుడు లేదు.. పీకలదాకా తాగి చలనం లేకుండా మత్తులోకి వెళ్లిపోయాడు ఓ లారీ డ్రైవర్.. అయితే, మత్తులో ఉన్న మందు బాబుపై ఒళ్లంతా అటూ ఇటూ పాకి చూడసాగింది కొండచిలువ.