Off The Record: నంద్యాల జిల్లా టీడీపీలో పీక్స్కు గ్రూప్ వార్..! మంత్రులు వర్సెస్ భూమా ఫ్యామిలీ..?
- నంద్యాల జిల్లా టీడీపీలో పీక్స్కు గ్రూప్ వార్..
- పార్టీ పరువు రోడ్డున పడుతోందని కేడర్ ఆవేదన..
- తాజాగా మంత్రులు వర్సెస్ భూమా ఫ్యామిలీ..
- సమీక్షా సమావేశంలో పాల్గొన్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి..
- ఎమ్మెల్యే అఖిలకు బదులు తమ్ముడు రావడమేంటని క్వశ్చన్..
- తమ్ముడు రావడానికి ఫ్యామిలీ ప్రోగ్రామా అని ప్రశ్న..
- నంద్యాల జిల్లా కలెక్టర్ కూడా నొచ్చుకున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నంద్యాల….. ఏ సీజన్లోనూ పొలిటికల్ హీట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ…. ఇక్కడి టీడీపీలో అయితే… ఆ డోన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే… తెలుగుదేశంలోని గ్రూప్వారే ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ…. అప్పుడప్పుడూ వీధికెక్కుతూ ఉంటుంది కూడా. మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై… పార్టీ పరువు రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు. ఈ విడత కొత్త కేరక్టర్ ఎంటరవడంతో… వ్యవహారం రక్తి కడుతోందట. తాజాగా నంద్యాలలో మంత్రులు వర్సెస్ భూమా ఫ్యామిలీగా మారిందట వ్యవహారం. రెండు గ్రూప్స్ మధ్య ప్రోటోకాల్ రగడ తెరపైకి వచ్చింది. నంద్యాల కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్థానంలో ఆమె సోదరుడు, ఆళ్ళగడ్డ టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి హాజరవడమే లడాయికి ప్రధాన కారణంగా తెలిసింది.
జిల్లా అభివృద్ధిపై కలెక్టర్తో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్కు జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరిత అటెండ్ అయ్యారు. కారణం ఏదన్నాగానీ.. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల మీటింగ్కి రాకపోగా… ఆమెకు బదులు తమ్ముడు విఖ్యాత్ వచ్చారు. సరే… వచ్చిన వ్యక్తి మామూలుగా ఉన్నారా… అంటే ఏదీ లేదు. ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా.. మంత్రులు , ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చుని వివిధ అంశాలపై అధికారుల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారట. ఇక్కడే మిగతా వాళ్ళకి మండిపోయిందని అంటున్నారు. అక్క రాకుంటే ఆమెకు బదులు తమ్ముడు రావడానికి ఇదేమన్నా… కుటుంబ కార్యక్రమమా? లేక పేరంటమా? ఎలాంటి అధికారిక హోదా లేకుండా విఖ్యాత్రెడ్డి వేదిక మీద కూర్చుని అధికారుల్ని ఎడాపెడా ఎలా ప్రశ్నిస్తారంటూ… మంత్రులు సహా మిగతా నేతలంతా ఫైరైపోతున్నట్టు సమాచారం. ఇదే విషయమై ముఖ్యమంత్రి ఆఫీస్లో ఫిర్యాదు చేశారట మంత్రులు. అలాగే విఖ్యాత్ విషయమై జిల్లా కలెక్టర్ కూడా ఒకింత నొచ్చుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ మీద నిఘావర్గాల సమాచారం కూడా సీఎంవోకు చేరినట్టు తెలుస్తోంది.
Also Read
నంద్యాల జిల్లా టీడీపీలో ఈ వివాదం మొదటిది కాదు, చివరిది అంతకంటే కాదు అనే టాక్ టీడీపీ వర్గాల్లోనే నడుస్తోందని అంటున్నారు. ఇక్కడ మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డికి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యం. ఫరూక్, అఖిల మధ్య అనేక సందర్భాల్లో విబేధాలు వచ్చాయి. అయితే అవి ఎప్పుడూ టీ కప్పులో తుఫానులా సమసిపోతుండేవి. కానీ… ఇప్పుడు మాత్రం మేటర్ డైరెక్ట్గా సీఎంవో దృష్టికే వెళ్ళడంతో… ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. అంతకు ముందు నంద్యాలలో అఖిలప్రియ టీడీపీ ఆఫీస్ ప్రారంభించినప్పుడు కూడా ఫరూక్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ నేతగా ఉన్న అఖిల నంద్యాలలో సొంతగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటని అప్పట్లో ప్రశ్నించారు ఫరూక్. అయితే….టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా తాను ఎక్కడికైనా వెళ్తానని, ఆళ్లగడ్డ నాదే….నంద్యాల నాదే అంటూ ఆమె కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అటు విజయ డైరీ వ్యవహారంలోనూ మంత్రులు ఇద్దరికి, ఎమ్మెల్యేకి మధ్య విబేధాలు మామూలుగా లేవట. విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి కి పరోక్షంగా మంత్రులు సహకరిస్తున్నారంటూ టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట భూమా. ఇలా తరచూ టీడీపీ లో అంతర్గత పోరు తరచూ ప్రత్యక్షంగా, పరోక్షంగా బయటపడుతూనే ఉంది. అయితే తాజాగా మాత్రం అధికారిక సమావేశంలో ఎలాంటి హోదా లేని ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి వేదిక మీద కూర్చోవడం, కలెక్టర్ కూడా హర్ట్ అవడం లాంటి పరిణామాల మధ్య వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి పెరిగింది పొలిటికల్ సర్కిల్స్లో.
తాజావార్తలు
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!