తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ఉత్కంఠ మధ్య కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తన నివాసంలోని రెండో అంతస్తులో అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఎన్నో చారిత్రాత్మక వ్యూహాలను రచించిన అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన…