Bengaluru: కొత్తగా పెళ్లయిన జంట రెండు రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇద్దరు 1000 కి.మీ దూరంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురువారం బెంగళూర్లో భార్య గనవి(26) ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల తర్వాత 36 ఏళ్ల సూరజ్ శివన్న నాగ్పూర్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గనవి సూసైడ్ తర్వాత, భర్తనే ఆత్మహత్యకు ప్రేరేపించడానే ఆరోపణలతో సూరజ్పై కేసు నమోదైంది.