రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు. అయితే, రామ్ చరణ్తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి.…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా ఆయన నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. Also Read: OTT Movie : ఓటీటీలోకి ‘DD…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో విక్టరీ వెంకటేశ్ భారీ హిట్ను ఖాతాలో వేసుకున్నారు. 2025 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రికార్డులు నెలకొల్పింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ, వెంకీ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో వెంకటేశ్ తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో వెంకీ సినిమా ఉంటుందని వార్తలు రాగా.. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ గురువారం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘డైరెక్టర్…
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ పాథలాజికల్ ఫిల్మ్ రావాల్సి ఉంది. కానీ బన్నీ.. ముందు అట్లీ ప్రాజెక్ట్ను మొదట పట్టాలెక్కించాడు. దీంతో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు. మొదట అల్లు అర్జున్ కోసం ఎదురుచూసినప్పటికి అతని నుంచి క్లారిటీ రాకపోవడంతో, త్రివిక్రమ్ ఈ పౌరాణిక కథను ఎన్టీఆర్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిల్మ్ని మొదట తారక్తోనే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.…
ప్రస్తుతం టాలీవుడ్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న యువ నిర్మాత నాగ వంశీ. తెలుగుదేశం పార్టీకి ఏకంగా పాతిక లక్షల విరాళం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. నాగ వంశీ విరాళం ఇచ్చిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. ఈ ఏడాది మహానాడు వేడుకలను కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన ఈ వేడుకలలో చంద్రబాబు తెలుగుదేశం…
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం సెట్స్పైకి వెళ్లబోతోంది. హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న కొత్త సినిమా రేపు (మే 19, 2025) ఉదయం హైదరాబాద్లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. నటన పరంగా ఇద్దరికి మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.…
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. వరుస ఫ్లోప్స్ తో రేస్ లో వెనకబడిన విజయ్ కింగ్డమ్ తో భారీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్తో ఊరమాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విజయ్ మాస్ పర్ఫామెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది.…
తెలుగులో మోస్ట్ వైరల్ నిర్మాత ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు నాగవంశీ. తన బాబాయ్ సూర్యదేవర చిన్నబాబు హారిక హాసిని క్రియేషన్స్లో కీలకంగా వ్యవహరించిన నాగవంశీ, తర్వాత స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి యూత్ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నాడు. శ్రీలంక నేపథ్యంలో సాగబోతున్న ఈ కథకు సంబంధించిన గ్లిమ్స్ ఇటీవల రివీల్ చేయగా, మంచి రెస్పాన్స్…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో ఓ వైపు బాలీవుడ్ సినిమా వార్ 2ను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు తారక్. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్…