భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆటగాళ్లు రంజీ బరిలోకి దిగారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు రంజీ మ్యాచ్లలో బరిలోకి దిగారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా ఆడలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెడ నొప్పి కారణంగానే బెంచ్కే పరిమితం అయ్యాడు. గత కొన్ని నెలలుగా…
ఇటీవల టెస్టుల్లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రంజీ బాట పట్టారు. సీనియర్ బ్యాటర్ అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా సహా మరికొందరు రంజీ మ్యాచ్లు ఆడేందుకు సిద్దమయ్యారు. చాలా ఏళ్ల నుంచి స్టార్ ప్లేయర్స్ రంజీలు ఆడడం లేదు కాబట్టి.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి…