దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో అభిమానుల కన్నీటి నివాళుల మధ్య లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై అభిమాన గాయని పార్థివ దేహానికి కడసారిగా నివాళులర్పించారు. విషాదంలో ఉన్న లతా మంగేష్కర్ కుటుంబీకులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆమె నివాసం నుంచి మొదలైన లతా మంగేష్కర్ అంతిమయాత్రకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.…