Mumbai: కోల్కతా వైద్యురాలి ఘటన మరవక ముందే దేశంలో పలు చోట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మహిళా వైద్యురాలిపై ఓ రోగి, అతని బంధువులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.