Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో విషాదం నెలకొంది. షకీల్ తల్లి కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. షకీల్ తల్లి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలిసిన పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు అచన్ పల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కుమార్తె పై కన్నతల్లి కేసు పెట్టేందుకు సిద్ధమవటం దానికి పోలీసులు సహకరించి వేధింపులకు దిగడంతో మౌనిక అనే యువతి విజయవాడలో సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
కుమారుడు మరణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లి వద్దకు వచ్చిన ఓ వానరం.. ఆ తల్లిని ఓదార్చింది. ఇక, తన కుమారుడే వానరం రూపంలో తన వద్దకు తిరిగి వచ్చాడని.. ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో చోటు చేసుకుంది..
పెళ్లయిన తర్వాత ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ గొడవలు పెద్ద వివాదంగా మారుతాయి. యూపీలోని ఘాజీపూర్ జిల్లా నుంచి ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ తన భర్తతో గొడవపడి తన పుట్టింటికి వెళ్లింది. ఇదంతా కామన్ అనుకున్న భర్త లైట్ చేసుకున్నాడు. కానీ.. భార్య తండ్రి ఫోన్ చేసిన ఓ విషయం చెప్పాడు. అది…
మన దేశంలోని చాలా కుటుంబాల్లో ఆడబిడ్డల కంటే మగ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. సామాజిక, ఆర్థిక కారణాలవల్ల కొడుకును ఆస్తిగా, కుమార్తెను బాధ్యతగా భావించడం అనాదిగా వస్తోంది. దాంతో పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి ఎంతోమంది గుట్టుచప్పుడు కాకుండా గర్భస్రావం చేయించుకుంటున్నారు. కడుపులోని ఆడబిడ్డను కడతేరుస్తున్న ఘటనలు మన దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది.
కన్నతల్లినే అతి కిరాతకంగా హత్య చేసిందో కూతురు. కనికరం కూడా లేకుండా.. ఆగ్రహంతో క్రూరాతి క్రూరంగా అమ్మను హత్య చేసింది. ముంబైలోని కుర్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితురాలిని 41 ఏళ్ల రేష్మా ముజఫర్ ఖాజీగా గుర్తించారు. ఆమె తల్లి సబీరా బానో(62). ముంబ్రాలో తన కుమారుడితో కలిసి నివసిస్తున్న సబీరా బానో.. గురువారం ఖురేషీ నగర్లోని తన కుమార్తె రేష్మా ఇంటికి వెళ్లింది.