Salumarada Thimmakka: కర్ణాటకకు చెందిన వృక్షమాత, పద్మశ్రీ పురస్కార గ్రహీత 114 ఏళ్ల సాలుమరద తిమ్మక్క అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఈ సమాచారాన్ని కుటుంబీకులు సమాచారం అందించారు. తిమ్మక్క మృతిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తంచేశారు.