మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. అజీజ్ నగర్లోని సర్వే నెంబర్ 177/33 పరిధిలో ఉన్న సుమారు 2.20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫామ్ హౌస్ పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో కట్టినట్లు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయ్యింది. 2006లో ఈ భూమి రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు రికార్డులు చెబుతున్నప్పటికీ,…