తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కరోనా రోగులకు సేవలు అందించడానికి ప్రత్యేక మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. మొదటి విడతలో 30 మొబైల్ ఐసీయూ బస్సులను హైదరాబాద్లో ప్రారంభించారు మంత్రి కేటీఆర్.. మొదటి దశలో జిల్లాకు ఒకబస్సును కేటాయిస్తున్నామన్న మంత్రి.. త్వరలో జిల్లాకు రెండు బస్సుల చొప్పున పంపిస్తామన్నారు. ఇది వినూత్న ఆలోచన.. దేశంలోనే ఇలాంటి సేవలు అందించడం మొదటిసారి అని వెల్లడించారు. ఇక, వైద్యులను దేవుడితో సమానంగా చూస్తున్నారు.. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..…