ప్రస్తుతం తెలుగు సినిమాలు కంటెంట్తో పాటు క్వాలిటీ విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్లోనూ అద్భుతాలు చేస్తున్న మూవీస్ వరుసగా వస్తున్నాయి. వాటిలో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘మిరాయ్’. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూపించిన విజువల్ ఫీస్ట్ సినిమా హైలైట్గా నిలవడంతో, ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘ది రాజా సాబ్’…
తాజాగా విడుదలైన తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ట్రామా మర్చిపోయి ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేంటి, తేజ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవడం ఏంటి అని మీకు అనుమానం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే, తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ స్వయంగా ఒక సీజీ కంపెనీ ప్రారంభించారు. ప్రొడక్షన్ కాస్ట్స్ తగ్గించుకునే పనిలో భాగంగా, ఆయనకు ఉన్న టెక్నికల్ స్కిల్స్…