AP Legislative Council : ఏపీ శాసనమండలిలో ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం సాగింది. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు కట్టిన చర్యలతో సభను అడ్డగించాలని వారు ప్రయత్నించారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో…
Nimmala Ramanaidu: మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరానికి ఉరి అని 45.72 నుంచి 41.15కు తగ్గిస్తున్నట్టు ఇవాళే చూసినట్టు రాసారు.. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో నేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం..
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు.
విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన రూ. 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశం ఇచ్చారు.
హంద్రీనీవా దుస్థితికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణం అన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమ్మర్ స్టోరేజిని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హంద్రీనీవా దుస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని విమర్శించారు.. 5 శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొల్లగొట్టుకుందన్నారు..
ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మూడు బోట్లను తొలగించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి అడుగున మరో రెండు బోట్లు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చేపడుతున్నామన్నారు.
Nimmala Ramanaidu: పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అధికారంలోకి వచ్చిన ఎన్ని రోజులకి అమ్మఒడి ఇచ్చావు అంటూ ప్రశ్నించారు.
విజయవాడ క్యాంప్ ఆఫీస్లో ఆపరేషన్ బుడమేరుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ఈఎన్సీ, ఎస్.ఇ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ, సర్వే అధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. బెజవాడ దుఃఖ దాయనిగా పిలవబడుతున్న బుడమేరుకు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికపై సమీక్ష నిర్వహించామని తెలిపారు.
మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలేరు రిజర్వాయర్కు అంత పెద్దమొత్తంలో వరద వచ్చినా ప్రాణ నష్టం జరగలేదంటే ప్రభుత్వ అప్రమత్తతే కారణమని మంత్రి పేర్కొన్నారు. 114 చోట్ల కట్ట బలహీనతలు గుర్తించి పటిష్టపరిచి ఆస్తి నష్టాన్ని తగ్గించామని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.