ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసిన 6.22 లక్షల మంది విద్యార్థుల్లో.. 4.14 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 67.26గా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా…