ఎనిమిది కార్పొరేషన్ చైర్ పర్సన్ కార్యాలయాలు ప్రారంభించామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 200 పైగా కార్పొరేషన్ చైర్మన్లు, 2000 పైగా డైరెక్టర్లు ఏర్పాటు చేశామని, తొంభై శాతం పైగా మహిళలకు అవకాశం ఇచ్చామన్నారు. ఎలక్షన్ల ముందు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు గతంలో.. కానీ సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. సమాజంలో అదరణకు నోచుకోని వారందరికి సీఎం జగన్ సామాజిక, రాజకీయ, ఆర్ధిక గుర్తింపు తెచ్చారని…
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సెటైర్లు వేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని కామెంట్ చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును గౌరవిస్తాం.. అదే, సమయంలో ప్రజా న్యాయస్థానం తీర్పు మాకు ముఖ్యం అన్నారు.. సాంకేతికమైన సమస్యలను అధిగమించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసిన అవంతి.. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు మాకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని..…
మూడు రాజధానుల అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. అదే తరహాలో మూడు రాజధానులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల విభజన చారిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని ఆయన తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. దరఖాస్తు గడువు మరోసారి పెంపు తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా…
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తనకు నివాసానికి…
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇళ్లపట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని ఆయన తెలిపారు. ఓటీఎస్ కట్టని వారికి…
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’. సునీల్, ‘బిగ్ బాస్’ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా తొలికాపీ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ ను వైజాగ్ అవంతి కాలేజీలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన…
ఏపీ ప్రభుత్వం నేడు ‘దేశీ 2021 మేకిన్ ఆంధ్రప్రదేశ్ వర్క్ షాప్’ అనే కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రిలు మేకపాటి గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్లు హజరయ్యారు. వీరితో పాటు డీఆర్డీవో చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులు వివిధ రంగాల ప్రముఖులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని వాటిపై చర్చించినట్లు తెలిపారు.…
గలగల గోదావరి.. ఆ చల్లని గోదారమ్మ ఒడిలో సేదతీరుతూ మనకిష్టమయిన ఆహారం తింటే భలేగా వుంటుంది కదూ. ఈ ఆలోచన పర్యాటక శాఖ వారికి వచ్చింది. రాజమండ్రి వద్ద గోదావరి నదిలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. 70 లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ రెస్టారెంట్ ను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లోటింగ్ రెస్టారెంట్…
గోదావరి నదిలో విహారం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. అందులోనూ పాపికొండల అందాలకు ముగ్ధులవ్వని పర్యాటకులు వుండరు. చాలాకాలంగా పాపికొండలకు వెళ్ళాలనుకునేవారికి నిరాశే కలిగింది. అయితే పరిస్థితులు మారడంతో ప్రభుత్వం పాపికొండల టూర్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి పాపికొండల సందర్శనకు పర్యాటకులకు అనుమతి మంజూరు చేసింది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం అవుతున్నాయి టూరిజం బోట్లు. రాజమండ్రి నుంచి వర్చువల్ గా పాపికొండల బోట్లను ప్రారంభించనున్నారు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసరావు. పాపికొండల…
పర్యాటకులకు మంత్రి అవంత శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. గత కొన్ని నెలల నుంచి నిలిచిపోయిన పాపికొండల బోటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం బోటు ఆపరేటర్లతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టూరిజం, నీటి పారుదల శాఖ అధికారులు, బోటు ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటకులకు బోట్లలో నిబంధనల ప్రకారం…