సైనిక సంఘర్షణతో సమస్యకు పరిష్కారం దొరకదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
Iran: శ్రీలంక దక్షిణ సముద్ర తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి(సబ్మెరైన్) పేల్చేసింది. అయితే, ఈ ఘటనపై ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి ఖండించారు. ఈ సంఘటన ‘‘సముద్రంలో జరిగిన దారుణం’’గా ఆయన అభివర్ణించారు.
Iran Attack on Saudi: ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతోంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్కోకు చెందిర రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ అరామ్కో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కార్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన…
Israel: ఇరాన్కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రం అవుతోంది. గత శనివారం జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని యూఎస్, ఇజ్రాయిల్ చంపేశాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలను ఇరాన్ చేపట్టింది. ఖమేనీ వారసుడిగా ఆయన కొడుకు కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ మిలిటరీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మద్దతు ఖమేనీ కుమారుడు మొజ్తాబాకు ఉంది.…
Iran Israel War: ఇజ్రాయిల్ ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. ఖమేనీతో పాటు చాలా మంది అగ్ర స్థాయి సైనిక, రాజకీయ నాయకులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై ఇజ్రాయిల్ దృష్టి సారించింది.
Israel-Iran War: మధ్యప్రాచ్యం అతలాకుతలం అవుతోంది. ఇరాన్పై యూఎస్-ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. శనివారం మొదలైన దాడులు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు, ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత, సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. టాప్ ఇరాన్ అధికారులు మరణించారు.
మధ్యప్రాచ్యం యుద్ధంలో కీలక మలుపు తిరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. డ్రాగన్ దేశం చైనా కూడా యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది. తాజాగా ఇరాన్కు మద్దతుగా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని ప్రకటించింది
Middle East War Escalates: మిడిల్ ఈస్ట్లో యుద్ధం హీట్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపిస్తోంది.. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లోని ఇరానేతరుల నివాసాలే టార్గెట్గా ఇరాన్ దాడి చేస్తోంది.. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనాలు వెళ్లిపోతున్నారు. మరోవైపు.. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి.. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.. తస్ తనోరాలోని ఆరామ్ కో…
Israel-Iran War: యూఎస్, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ముదురుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. టాప్ 40 కమాండర్లను కూడా చంపేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇందులో రక్షణ మంత్రితో పాటు ఇరాన్ కీలక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చీఫ్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే, శనివారం ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ మరణించారు. ఈ దాడిలో అహ్మదీనెజాద్ సన్నిహిత సలహాదారులు మరియు అంగరక్షకులు కూడా…
Breaking News: పశ్చిమాసియా పరిణామాలు, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. తమిళనాడు పర్యటన తర్వాత ఆదివారం రాత్రి మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత సేవాతీర్థ్లో ఈ సమావేశంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ గురించి చర్చించే అవకాశం ఉంది.