పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలపై ఇరాన్తో చర్చించినట్లుగా ఎక్స్లో జైశంకర్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కీలక భాగస్వాములతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కృషి చేస్తోంది. ప్రతి దేశానికి సంయమనం, దాడులను ఆపడం, చర్చలు కొనసాగించడం అత్యంత అవసరమని భారత్ అభిప్రాయపడింది. సంక్షోభం మరింత…
Khamenei: మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు దారుణంగా మారాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్పై దాడితో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఇప్పటికే ఖామేనీ మరణించిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజకీయ చరిత్రలో శనివారం ఒక విషాద మలుపుగా నిలిచిపోయింది. దాదాపు నలభై ఏళ్ల పాటు దేశాన్ని నడిపించిన అత్యున్నత మత నాయకుడు అయతుల్లా అలీ ఖామెనీ అనంత లోకాలకు చేరుకోవడం ఆ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అలీ ఖామెనీ వయస్సు 86 ఏళ్లు. 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు…