ఆన్లైన్ పుణ్యమా అని.. ఎవరు అసలు.. ఎవరు నకిలీ అనే గుర్తించడమే కష్టంగా మారిపోయింది… ఆశ చూపుతూ అన్నీ దోచేస్తున్నారు.. అసలు విషయం తెలిసేలోపు.. అందినకాడికి దోచేస్తున్నారు.. తాజాగా, విశాఖ, మాట్రిమోనీ ముసుగులో మస్కా కొట్టిన ఘటన వెలుగుచూసింది.. రెండో వివాహం కోసం ప్రొఫైల్ పెట్టిన మహిళలే టార్గెట్గా.. వెబ్ సైట్లో పెట్టిన వివరాల ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు నైజిరియన్లు.. విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు చెబుతూ పరిచయం చేసుకుంటున్న కేటుగాళ్లు.. విలువైన బహుమతులు పంపుతున్నామంటూ వల…
ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి.. ఈ మోసాలు పలురకాలు.. కొంతమంది బ్యాంకు వివరాలను మాయమాటలు చెప్పి తెలుసుకొని కొట్టేస్తుంటే.. ఇంకొంతమంది మ్యాట్రిమోని పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు. మరికొంతమంది డబ్బుతో పాటు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి తనకు తాను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి నలుగురు యువతులను మోసం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెల్గాంకు కుంపాత్గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి మ్యాట్రిమోనీలో వధువు కావలెను…