Congress: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సోమవారం లోక్సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చర్చించేందుకు ఈ సభ జీరో అవర్లో అవకాశం ఇవ్వాలని నోటీసులో కోరారు.