మణిపూర్లో జాతి హింస చెలరేగిన 862 రోజుల తర్వాత, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్తున్నారు. 2023 హింస తర్వాత ఆయన తొలిసారి మణిపూర్ లో పర్యటిస్తున్నారు. మణిపూర్ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 13న ప్రధాని మోడీ మణిపూర్ కు చేరుకుని రూ.8500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ప్రకటించారు. ప్రధాని మోడీ ముందుగా చురచంద్పూర్ వెళ్లి, అక్కడ జిల్లాలోని కొంతమంది నిరాశ్రయులైన ప్రజలను కలుస్తారని తెలిపారు.…
PM Modi Manipur Visit: జాతి ఘర్షణలతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్కు ప్రధాని నరేంద్రమోడీ రేపు వెళ్లనున్నారు. మే 2023లో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత తొలిసారి ప్రధాని పర్యటనకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ్రువీకరించారు. ఈ పర్యటన గురించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ, తొలిసారిగా అధికారిక ప్రకటన వచ్చింది.