Rajnath Singh: భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తున్న రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నట్లు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 15,920 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. విదేశీ కంపెనీలు తమ రక్షణ పరికరాలను…
India successfully test-fires Quick Reaction Surface to Air Missile system: భారత అమ్ములపొదిలో కొత్తకొత్త ఆయుధాలు, క్షిపణులు, క్షిపణి నిరోధక వ్యవస్థలు చేరుతున్నాయి. పూర్తిగా మేకిన్ ఇండియా ప్రోగ్రాం కింద పలు అత్యాధునిక ఆయుధాలను రూపొందిస్తోంది ఇండియా. తాజాగా క్విక్ రియాక్షన్ సర్ఫెస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూఆర్ఎస్ఏఎం) వ్యవస్థ పరీక్ష విజయవంతం అయింది. ఈ విషయాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) గురువారం వెల్లడించింది.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ కుటుంబంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మరోసారి తెలంగాణపై విషం చిమ్మారని, ఆయన చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. తల్లిని చంపి పిల్లని బతికించారన్న మోదీకి.. తెలంగాణ అమరవీరుల గురించి అర్హత లేదని, అసలు తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని…
మోదీ మేక్ ఇన్ ఇండియా ప్లాన్ వ్యర్ధమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారని బీజేపీ నేత కరుణా గోపాల్ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, నిర్మలా సీతారామన్ పై కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని, మోదీ ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల్లో కేటీఆర్ అపోహలు సృష్టించారని విమర్శించారు. నడ్డా అడ్డా ఎర్రగడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని, పారిశ్రామిక వేత్తలకు రాజకీయ అజెండాలు ఉండవని, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ సహకారం తీసుకుని ముందుకు వెళ్తారని…
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి గతి శక్తి వల్ల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని, ఈ బడ్జెట్ చారిత్రాత్మకం అన్నారు సీఐఐ ఛైర్మన్ తిరుపతి రాజు. రోడ్ల నిర్మాణం ప్రణాళిక హర్షించదగింది. నదుల అనుసంధానం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్హి, వనరుల వినియోగానికి బాగా ఉపకరిస్తుందన్నారు. మెజార్టీ వాటా గతి శక్తికి కేటాయించడం చాలా ప్రయోజనకరం. స్కూళ్ల డిజిటలైజేషన్ విద్యావ్యవస్థలో మార్పుకి అవకాశం కల్పించింది. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు, పరిశ్రమలతో అనుసంధానం…
మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్గు విజయవంతంగా తన డ్రిల్లింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అతి త్వరలోనే మరో రిగ్గు ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. రానున్నరోజుల్లో మేఘా రిగ్గులు తయారు చేయడం వల్ల దేశీయంగా, అంతర్జాతీయ స్థాయిలో రెండు బిలియన్ డాలర్ల విలువ గల మార్కెట్ ను సొంతం చేసుకోనుంది. ఒ ఎన్ జీ సీ కి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో భాగంగా ప్రస్తుతానికి…