Laptop Import Ban: ల్యాప్టాప్లు, కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం లేదు.. కొత్త రూల్స్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laptop Import Ban: మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిని నిషేధించాలని ఒక రోజు ముందు అంటే 2023 ఆగస్టు 3, గురువారం నాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్టు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
దేశంలో నమ్మకమైన హార్డ్వేర్ వ్యవస్థలను నిర్ధారించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కేటగిరీల ఉత్పత్తుల్లో దేశీయంగా తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. దిగుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కంపెనీలకు మరికొంత సమయం ఇవ్వవచ్చు. ట్విటర్లో ఒక వినియోగదారుకు స్పందిస్తూ, ఇది లైసెన్స్ కు సంబంధించిన విషయం కాదని, దిగుమతులను నియంత్రించే విషయమని అన్నారు. దీనికి ప్రతిగా నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే దిగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంపెనీలు, వ్యాపారులు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఐటీ హార్డ్వేర్లను దిగుమతి చేసుకోవచ్చు.
Also Read
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
Q: Why has the @GoI_MeitY finalized new norms for import of IT hardware like Laptops, Servers etc?
Ans: There will be a transition period for this to be put into effect which will be notified soon.
Pls read 👇 https://t.co/u5436EA0IG
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023
➡️India is becomng one of worlds fastest growing markets for Digital products includng Laptops, Servers etc.
➡️India and DigitalNagriks will consume millions of Digital products in coming Techade.
➡️Rapid digitilization / cloudification of our economy AND rapid growth of our… https://t.co/gdMcNnsEUT
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023
చదవండి: Andrapradesh : తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
ప్రభుత్వ నిర్ణయంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరల్లో ఎలాంటి పెంపుదల ఉండదని, అలాగే వీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటిని దిగుమతి చేసుకునేందుకు కేవలం 5 నిమిషాల్లోనే లైసెన్స్ను జారీ చేస్తామని చెప్పారు. డీజీఎఫ్టీ ఆన్లైన్ లైసెన్స్ పోర్టల్ సిద్ధంగా ఉంది. ఇది వచ్చే ఏడాది వరకు చెల్లుబాటు అవుతుంది. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతిని కఠినతరం చేయడం ద్వారా చైనాతో భారత్ వాణిజ్య లోటును తగ్గించడంతోపాటు దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..