Laptop Import Ban: ల్యాప్టాప్లు, కంప్యూటర్ల దిగుమతిపై నిషేధం లేదు.. కొత్త రూల్స్ జారీ
Laptop Import Ban: మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిని నిషేధించాలని ఒక రోజు ముందు అంటే 2023 ఆగస్టు 3, గురువారం నాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్టు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
దేశంలో నమ్మకమైన హార్డ్వేర్ వ్యవస్థలను నిర్ధారించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కేటగిరీల ఉత్పత్తుల్లో దేశీయంగా తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. దిగుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కంపెనీలకు మరికొంత సమయం ఇవ్వవచ్చు. ట్విటర్లో ఒక వినియోగదారుకు స్పందిస్తూ, ఇది లైసెన్స్ కు సంబంధించిన విషయం కాదని, దిగుమతులను నియంత్రించే విషయమని అన్నారు. దీనికి ప్రతిగా నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే దిగుమతులపై ఎలాంటి నిషేధం విధించలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కంపెనీలు, వ్యాపారులు ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, ఐటీ హార్డ్వేర్లను దిగుమతి చేసుకోవచ్చు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Q: Why has the @GoI_MeitY finalized new norms for import of IT hardware like Laptops, Servers etc?
Ans: There will be a transition period for this to be put into effect which will be notified soon.
Pls read 👇 https://t.co/u5436EA0IG
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023
➡️India is becomng one of worlds fastest growing markets for Digital products includng Laptops, Servers etc.
➡️India and DigitalNagriks will consume millions of Digital products in coming Techade.
➡️Rapid digitilization / cloudification of our economy AND rapid growth of our… https://t.co/gdMcNnsEUT
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023
చదవండి: Andrapradesh : తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
ప్రభుత్వ నిర్ణయంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరల్లో ఎలాంటి పెంపుదల ఉండదని, అలాగే వీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటిని దిగుమతి చేసుకునేందుకు కేవలం 5 నిమిషాల్లోనే లైసెన్స్ను జారీ చేస్తామని చెప్పారు. డీజీఎఫ్టీ ఆన్లైన్ లైసెన్స్ పోర్టల్ సిద్ధంగా ఉంది. ఇది వచ్చే ఏడాది వరకు చెల్లుబాటు అవుతుంది. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్ల దిగుమతిని కఠినతరం చేయడం ద్వారా చైనాతో భారత్ వాణిజ్య లోటును తగ్గించడంతోపాటు దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!