శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి.
Kerala High Court Verdict on Sabarimala Temple: అయ్యప్ప స్వామి దర్శనం, మకరజ్యోతిని చూసేందుకు భక్తులు శబరిమలకు పయణం అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ హైకోర్టు శబరిమలపై కీలక తీర్పును వెలువరించింది. శబరిమల గర్భగుడిలోకి రాజకీయ నాయకులు, ప్రముఖుల పోస్టర్లను తీసుకెళ్లే యాత్రికులను అనుమతించవద్దని శబరిమల ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. దేవస్థానం సన్నిధానంలోకి పోస్టర్లు మోసుకెళ్లడాన్ని నిషేధించింది.