Amit Shah:” నన్ను క్షమించండి” తమిళులకు అమిత్షా క్షమాపణలు..
- తమిళనాడు ప్రజానికానికి అమిత్ షా క్షమాపణలు
- ఈషా ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొ్న్న షా
- ప్రపంచంలోని పురాతన భాష తమిళమన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు. మహాశివరాత్రి నాడు తనకు ఆది శివుని దర్శనం లభించిందని.. అందుకు సద్గురుకి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మహా కుంభమేళా ప్రయాగ్రాజ్లో ముగుస్తుందని.. ఈరోజు కోయంబత్తూరులో భక్తి మహా కుంభమేళా జరుగుతోందని అమిత్ షా చెప్పారు.
READ MORE: Kishan Reddy : హైదరాబాద్ గ్లోబల్ హెల్త్కేర్, ఫార్మా హబ్గా ఎదుగుతోంది
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
“ఈ రోజు శివుడు, పార్వతులు కలిసిన దినం. ఇక్కడ శివుడు ఆదియోగి రూపంలో కూర్చుని దర్శనమిస్తున్నాడు. ఆయన వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. సద్గురు గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భక్తి, యోగా కోసం ఆయన అభివృద్ధి చేసిన ఈ ప్రదేశం మానవాళికి గొప్ప సేవగా తయారైంది. ఈ 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం 112 ఆధ్యాత్మిక మార్గాలను చూపుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే శివత్వమే అంతిమ లక్ష్యం అని గ్రహిస్తారు. ఈశా యోగా… యువతను దేవునితో అనుసంధానించే మాధ్యమంగా మారింది. సద్గురు యువతను మతంతో అనుసంధానించడమే కాకుండా వారికి మతం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ రోజు, సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రజలకు జీవించే మార్గాన్ని బోధిస్తున్నారు. మీ ద్వారా ప్రపంచం మొత్తం సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునే అవకాశం లభించింది. మీ ద్వారా ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి సందేశాన్ని అందుకుంది.” అని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
READ MORE: Aadhi Pinisetty: ‘శబ్దం’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వున్న హారర్ ఫిల్మ్: హీరో ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ
సద్గురు.. ప్రపంచం ముందు జాతీయ ఆస్తిగా ఎదిగారని.. ఆదియోగం ద్వారా యోగాకు గుర్తింపు ఇచ్చారని అమిత్ షా అన్నారు. మోడీ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరించారన్నారు. యోగా పురాతనమైనది కానీ.. ఇప్పటి జనాలకు తప్పకుండా అవసరమని తెలిపారు. యోగా భక్తికి మార్గం సుగమం చేస్తుందని… ఒకరిని దైవంతో అనుసంధానిస్తుందన్నారు. తమిళ చరిత్ర లేకుండా భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిని వివరించడం సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. మహర్షి తిరుమూలన్ మన వేదాలలోని 3000 కంటే ఎక్కువ శ్లోకాలను అధ్యయనం చేశారని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!