మహారాష్ట్రలోని గోండియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ప్యాసింజర్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మంజార్సంబా-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు.