పార్ట్టైం జాబ్ అంటూ ‘లవ్ లైఫ్’ పేరుతో వేలాది మంది దగ్గర నుంచి సుమారు రూ.200 కోట్లు మోసం చేసిన ఘటనలో బాధితులు రాష్ట్రవ్యాప్తంగా బయటకు వస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుల్లోనే కాక ఇలా రాష్ట్రవ్యాప్తంగా లవ్లైఫ్ యాప్ బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 18 లక్షలు కట్టినట్టు బెజవాడ సైబర్ పోలీసులకు ఓ బాధితుడు…