చంద్రబాబు, నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరని.. ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు. గత…
ప్రభుత్వాన్నీ అస్థిరపరచడం,బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో లోకేష్ పర్యటనలో కరోనాతో మరణించిన పార్టీ నాయకులు కుటుంబాల పరామర్శ కోసం అని భావించాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్… రాజకీయం మాట్లాడి వెళ్లారు. లోకేష్ కు చరిత్ర తెలియదు… టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల్ని ఊచకోత కోశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు లోకేష్, చంద్రబాబుకి లేదు. టీడీపీ అన్ని వర్గాలను దూరం చేసుకున్నందుకే జగన్మోహన్…
కరోనా తగ్గుతున్న వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఆలోచిస్తారు. చంద్రబాబు రాబందులా… చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారు అని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు రాజకీయ కుట్రలు చేశారని అందరికీ తెలుసు. కుట్రలో చిక్కుకున్నానని డాక్టర్ సుధాకర్ అప్పుడే…
డాక్టర్ సుధాకర్ ఓ మంచి డాక్టర్ అని, ఎన్నో అవార్డులు వచ్చాయని, వైద్యవృత్తినే నమ్ముకొని జీవనం సాగించే సుధాకర్కు గుండు కొట్టించి హింసించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సుధాకర్ ఏం తప్పు చేశారో చెప్పాలని, ఓ మాస్క్ అడిగినందుకు ఇంత దారుణంగా హింసించారని, ఆయన కుటుంబాన్ని వేదించారని అన్నారు. న్యాయం జరిగేలోపే ఆయన చనిపోయారని, నర్సీపట్నం ఎమ్మెల్యే నుండి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకుల వరకు ఆయన చావుకు కారణమయ్యారని, దళితులపై…
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఏపీకి పట్టిన కరోనా కంటే భయంకర వైరస్ లు అని మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. వార్డు మెంబరుగా కూడా గెలవని లోకేష్ ట్వీట్లకు ఏం సమాధానం చెబుతామని మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివర్ అంశాలను కేంద్రం పర్యవేక్షిస్తోందని..వైజాగ్ లో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటే 100 మెట్రిక్ టన్నులు మనకు ఇచ్చి మిగిలింది మహారాష్ట్ర కు ఇవ్వమన్నారని తెలిపారు. ఏపీని..ఒరిస్సా నుంచి…