విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ ఘటనపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2020లో ఘటన జరిగినపుడు 15 మంది మృతి చెందారు.