కర్నూలు జిల్లాలో ఓ వింత పందెం వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసింది. బతికి ఉన్న చేపను మింగాలని సరదాగా స్నేహితులు వేసుకున్న పందెంతో ఓ వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. బతికున్న చేపను మింగి వెంకటస్వామి అనే వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడొక నిత్య పెళ్ళికొడుకు. ఇస్రోలో హెచ్ఆర్ ఉద్యోగం అని చెబుతూ.. వందల ఎకరాల పొలాలు, విల్లాలు ఉన్నాయని ... పెళ్లికూతుళ్ల కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చి లక్షలకు లక్షలు దోచేస్తున్న ఆ ప్రబుద్ధుడి ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.1.5 లక్షల కోట్లతో మూసీ రివర్ఫ్రంట్ వంటి గొప్ప కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిస్తూనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి అనడంపై ఆయన మండిపడ్డారు. “ప్రతిరోజూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెరుగుతున్న అప్పుల గురించి ఏడుస్తూనే ఉంటాడు, కానీ చాలా మందికి అనవసరమైన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్…
హైడ్రాపేరుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవ విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కొన్ని వ్యవస్థలు ప్రభుత్వం పై చేస్తున్న నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, మూసీ రిజర్వేషన్ పై సీఎం, ప్రభుత్వం కార్యక్రమంపై అపోహలు సృష్టించి… పాలనపై తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.…
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్తో భేటీ కానున్నారు.
రోజు రోజుకు కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. మటన్, చికెన్ ధరలకు పోటీగా కూరగాయాల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు జేబులకు చిల్లుపడుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూరగాయాల ధరలు ఆకాశానంటుతున్నాయి. పండుగ వేళ కావడంతో మార్కెట్లలో పూల ధరలు సైతం పెరిగిపోయాయి. అయితే.. దేవి నవరాత్రోత్సవాల ఉండటంతో శాఖాహార ప్రియులు కూరగాయలు కొనడం తప్పదనే చెప్పాలి. అయితే.. ముఖ్యంగా కూరగాయాల్లో టమాటో ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మైదరాబాద్ మార్కెట్లలో కిలో టమాటో ధర…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. ‘అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని నేను. హైడ్రాసంస్థకు, హైదరాబాద్ ముంపు గురికాకుండా చూసేందుకు, మూసీ ప్రక్షాళనకు, మూసీను కొబ్బరినీళ్లలా చేసేందుకు, ఎకలాజికల్ బాలన్స్ కాపాడడానికి, విదేశీ పక్షులు రావడానికి, చేపలు పెంచడానికి, పిల్లలు ఈతకొట్టేల చెరువులు తయారు చేయడానికి నేను వ్యతిరేకం కాదు. చెరువు కన్నతల్లి లాంటిది. కానీ హైదరాబాద్ లో ఉన్న ఏ చెరువు…
తెలంగాణలోని ప్రముఖ పూల పండుగ బతుకమ్మను అరేబియా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించబడుతుండటంతో జెడ్డా వ్యాప్తంగా తెలంగాణ ప్రవాసాంధ్రులలో సంబరా వాతావరణం నెలకొంది. బతుకమ్మ సంబరాలను నిర్వహించడంలో గల్ఫ్ ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుంది. గల్ఫ్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (జిడబ్ల్యుసిఎ) ఆధ్వర్యంలో దుబాయ్లోని వివిధ సంస్థలు శని, ఆదివారాల్లో ఈ వేడుకను జరుపుకోవడానికి పోటీ పడుతున్నాయి. జువ్వాడి శ్రీనివాస్రావు, సలావుద్దీన్, శామ్యూల్,…
హైదరాబాద్ నగరం వివిధ మతాలకు, సంస్కృతులకు ప్రతీకగా ఉంది. కానీ, ఇటీవలి కాలంలో పాశ్చాత్య సంస్కృతితో కలుషితం అవుతోంది. ఢిల్లీ, ముంబైలకు పరిమితమైన పబ్ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తోంది. వీకెండ్లో నగర యువత పబ్లలో నింగి తాకుతూ, మద్యం సేవించి, అర్థనగ్న డాన్సులకు రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, పబ్ నిర్వాహకులు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలతో డాన్సు షోలు ఏర్పాటు చేసి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడం జరుగుతోంది. కొంతకాలం క్రితం కేబీఆర్ పార్క్…