Home
Latest News
Latest News News
-
ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ లో మరో 1,400 మందికి ఉద్యోగాలు
వచ్చే 18 నెలల్లో కరీంనగర్, వరంగల్, ఖమ్మం మరియు హైదరాబాద్ మధ్య మరో 1,400 మంది ఉద్యోగులను చేర్చుకునే ప్రణాళికను హెల్త్ టెక్నాలజీ సేవల సంస్థ ఎక్లాట్ హెల్త్ ప్రకటించింది. వాషింగ్టన్ DCలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సంస్థ, తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలను కలిగి ఉంది. దీనికి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ గల్ఫ్ క్యాపిటల్ మద్దతు ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్ ఇప్పటికే 200 మంది ఉద్యోగులను కలిగి ఉన్న… -
ఆ బ్యాంకు కు షాక్ ఇచ్చిన ఆర్బీఐ..
మరో బ్యాంకు కుప్పకూలింది. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెన్స్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రద్దు చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలను సీజ్ చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. నేటి నుంచే అంటే ఫిబ్రవరి 3, 2022 నుంచే ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. గురువారం దీనిపై ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, తాము గతేడాదినే కొన్ని ఆంక్షలు విధించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో ఆరు… -
బండి సంజయ్ కు సవాల్ విసిరిన హరీష్ రావు
హైదరాబాద్లో కాకుండా న్యూఢిల్లీలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్… -
మార్చిలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. గత సంవత్సరం, కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి కారణంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు హోమ్ ఆధారిత అసైన్మెంట్లుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. సాధారణ స్ట్రీమ్ల విద్యార్థులకు పూర్తి మార్కులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు విద్యార్థులు తమ కళాశాలల్లోనే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. “ఇప్పుడు ఫిజికల్ క్లాసుల కోసం కాలేజీలు తిరిగి తెరవబడినందున, సంబంధిత కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది మొత్తం సిలబస్లో 70 శాతం… -
టీడీపీ తో చేతులు కలిపిన కాంగ్రెస్
త్వరలో అండమాన్ నికోబార్లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్లో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ… -
బంతి ఉద్యోగ సంఘాల కోర్టు లోనే ఉంది : బొత్స సత్యనారాయణ
ఏపీలో పీఆర్సీ పై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా ఎన్టీవీ తో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు వల్లే చలో విజయవాడకు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదని, చలో విజయవాడ ను పాజిటివ్ గానూ చూడటం లేదు… నెగెటివ్ చూడటం లేదని ఆయన అన్నారు. బంతి ఉద్యోగ సంఘాల కోర్టు లోనే ఉందని, ప్రభుత్వం చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఆయన… -
కేసీఆర్ మాట్లాడిన అంశాలు సిగ్గు చేటు : పొన్నాల లక్ష్మయ్య
రాజ్యాంగం మీద ప్రమాణము చేసిన వ్యక్తి మాట మార్చడం అనేది సరి కాదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తులు కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ద్వారానే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. కొత్త రాజ్యాంగం కావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్నట్లే కదా అని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 65 సార్లు హై కోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ… -
కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది : చొప్పదండి ఎమ్మెల్యే
కేసీఆర్ వాఖ్యల పై బీజేపీ నాయకులు చిల్లర మల్లారా మాటలు మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశ పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దళిత మహిళలపై అత్యాచారాలు చేసి చంపిన ఘటనలున్నాయని ఆయన ఆరోపించారు. బడ్జెట్ లో… -
నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారు : శైలజానాథ్
నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. భారత్ ను కొద్దిమంది వ్యక్తులకు అమ్మివేసే బీజేపీ నేతలు దేశ ద్రోహులు అని ఆయన ఆరోపించారు. అడవులను అటవీ సంపదను, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, రైల్వే ను విమానాలను అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజులు పరిపాలించాలి, డబ్బు అంతా బడా బాబుల వద్ద ఉండాలన్న విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. అదాని అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు బీజేపీ… -
బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రాజ్యాంగం పై చర్చ పెట్టండి : ఎమ్మెల్యే గువ్వల
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కొత్తగా నిర్మించాల్సి వస్తే అంబేద్కర్ నే ప్రేరణగా తీసుకుంటారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు తేవాలన్నదే సీఎం ఆలోచన అని, బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే రాజ్యాంగం పై చర్చ పెట్టండి అని ఆయన సవాల్ విసిరారు. స్వాతంత్రము వచ్చిన ఇన్నేళ్ల లో బడుగు బలహీన వర్గాలు జీవితాలు…
తాజావార్తలు
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..