అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం మేనల్లుడుని ఈడీ అరెస్ట్ చేయడం పంజాబ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈడీ అరెస్ట్ చేసిన పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హాని ను వైద్య పరీక్షల తరువాత మొహాలీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. భూపిందర్ సింగ్ పై అక్రమ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈడీ అధికారులు భూపిందర్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ. 8 కోట్ల నగదును సీజ్ చేశారు.
ఈ నేపథ్యంలో భూపిందర్ సింగ్ పై మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఈడీ అధికారులు భూపిందర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సుమారు 8 గంటల విచారించిన ఈడీ అధికారులు అనంతరం భూపిందర్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం చన్నీ మేనల్లుడు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అవడం కలకలం రేపుతోంది.