Turtuk: భారత్లో చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేదని ఎంత మందికి తెలుసు. 1971 ఇండో పాక్ యుద్ధం తర్వాత పాక్ భూభాగంలోని ఈ గ్రామం భారత్లో చేరింది. ఇప్పుడు, ఈ గ్రామం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గ్రామమే భారత్-పాక్ సరిహద్దుల్లోని ‘‘తుర్టుక్’’. లడఖ్లోని నుబ్రా లోయలో, ష్యోక్ నది ఒడ్డున ఉన్న ఈ అందమైన గ్రామానికి టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాల్టి సంస్కృతికి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.