ఆంధ్రప్రదేశ్లోని భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ పేద రైతుల సమస్యలను తీర్చేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. రేపు ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూముల్ని లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు.