Food Adulteration: హైదరాబాద్ లోని కుల్సుంపురా ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా కుళ్లిపోయిన గుడ్లతో ఎగ్ పఫ్స్ తయారు చేసి హోటళ్లకు పంపిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించారు. Ishan…