Kuldeep Bishnoi Joins BJP: కాంగ్రెస్ పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. బుధవారం యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే వరసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కీలక నేేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ పాార్టీలో చేరబోతున్నారు.