Kuldeep Bishnoi: కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన కీలక కాంగ్రెస్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuldeep Bishnoi Joins BJP: కాంగ్రెస్ పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. బుధవారం యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే వరసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కీలక నేేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ పాార్టీలో చేరబోతున్నారు.
తాజాగా హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత కుల్ దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుకా బిష్ణోయ్ తో కలసి బీజేపీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ సహా బీజేపీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన కుల్ దీప్ బిష్ణోయ్ హర్యానాలో కీలక నేతగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తమ ప్రధానిగా కొనియాడారు కుల్ దీప్ బిష్ణోయ్. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిష్ణోయ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అతన్ని బహిష్కరించింది. దీంతో నిన్న బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రోజు బీజేపీలో చేరారు.
Also Read
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
Read Also:Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు.. భయపడేది లేదు..
కుల్ దీప్ బిష్ణోయ్ హర్యానాతో పాటు రాజస్థాన్ లో కూడా గణనీయమైన మద్దతు కలిగిన కీలక నేతగా ఉన్నారు. రాజస్థాన్ బిష్ణోయ్ కమ్యూనిటీ మద్దతు కూడా కుల్ దీప్ బిష్ణోయ్ కు ఎక్కువగా ఉంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి బలం చేకూరే అవకాశం ఉంది. అంతకుముందు 2014 రాష్ట్ర ఎన్నికల్లో హర్యానా జనహిత్ పార్టీ ప్రారంభించిన బిష్ణోయ్ ఆ తరువాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడే కుల్ దీప్ బిష్ణోయ్. జాట్ యేతర ఓటు బ్యాంకుకు కీలకంగా మారనున్నారు బిష్ణోయ్.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!